బాల్యం

బాల్యం జాతర లో కొన్న 
రంగుటద్దాలు పెట్టుకున్నది 
రంగు రంగుల లోకం
సీతా కోకచిలుకై  పరుగెత్తుతుంటే 
దానెంట పాదాలు
పదనిసలు పాడాయి
కాలం కరిగిపోయింది
రంగద్దాలు వెలసిపోయాయి
రంగుల్ని అందుకోలేక 
పాదాలు పల్లెరులయ్యాయి 
కాముని జాజర వర్ణాలన్ని
విలీనమై ఓ విశాల 
శ్వేత వర్ణానికి జన్మనిచ్చాయి
అ విశాల విశ్రాంత చాయలో 
బాల్యం జాతర గుర్తొచ్చి 
మనసు తుమ్మెదై
సప్తవర్ణ గానాన్ని  
వినిపిస్తూనేఉండేది

No comments:

Post a Comment